History of Lord Sri Ram - Real Proofs of Wonders in India


రామేశ్వరం::

సీతమ్మ వారికై రాముడు వారధిని నిర్మించిన ప్రదేశం. అక్కడ అతి తక్కువ దూరంలో శ్రీలంకను చేరే మార్గముంది. కేవలం ముప్పై కి.మీ. (పద్దెనిమిది నాటికల్ మైల్స్) దూరంలో శ్రీలంక తీరం మల్లైతీవు చేరుకోవచ్చు.. అయితే వారధినిర్మించే సమయం అగ్ని పర్వత శిలలను వానరసైన్యం సముద్రంలో జారవిడిచే టపుడు సముద్రుడు వాటిని నిలవనీయలేదట. ఎన్ని సార్లు వేసినా అలలు వాటిని చెల్లాచెదరు చేస్తున్నాయట.. అప్పుడు శ్రీరాములవారు సముద్రుడి గర్వమణచడానికి ధనస్సు(విల్లు) కొన(కోటి) ను ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతాడట. అప్పుడు భయపడిన సముద్రుడు వారధి కట్టేందుకు అనుకూలించి తన నిజ స్వరూపాన్ని మార్చు కుంటాడట. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది... అస్సలు అలలు(పెద్దపెద్దవి) రావు..

రాముడు ధనస్సు కొనను సవరించిన ప్రదేశం ధనుష్కోటి... అక్కడ ప్రదేశం చాలా బావుంటుంది.. ఒక పది సంవత్సరాల క్రితం సంభవించిన తుఫాన్ లో ఇక్కడి జనజీవనం అస్తవ్యస్థమైంది... రవాణా వ్యవస్థ చెడి పోయింది.. కానీ ఇప్పుడిప్పుడే తిరిగి రూపుదిద్దు కుంటోంది...

జీవిత కాలంలో ఒక్క సారైనా చూడవలసిన క్షేత్రం రామేశ్వరం...
© 2014 TIRUMALA BALAJI INFO - ALL RIGHTS RESERVED
Template By FIANESIA Diberdayakan oleh Blogger